NDL: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సీమ ప్రజలకు అన్యాయమే జరుగుతోందని శుక్రవారం మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపించారు. సీమ అభివృద్ధి నిరోధకుడిగా CBN మారారన్నారు. శ్రీశైలం జలాశయం నిండినా సీమ ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేయకుండా ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని విమర్శించారు. ఈనెల 24న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ధర్నా చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
24న పోతిరెడ్డిపాడు వద్ద ధర్నా: శైలజానాథ్


