హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరాటే పోటీలకు మన్యం క్రీడాకారులు

PPM: గుజరాత్ రాష్ట్రం వడోదరలో ఈనెల 22 నుంచి జరగనున్న 20వ WKFI ఇండిపెండెన్స్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్-2026కు మన్యం జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. జెడ్పీహెచ్‌ఎస్ బందలుప్పికి చెందిన బోను వినీత అండర్-14, కేజీబీవీ కవిటిభద్రకు చెందిన బోను అమల అండర్-17 విభాగాల్లో కటా, కుమిటే పోటీల్లో పాల్గొననున్నారు.