హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిహారం చెల్లించి పనులు చేపట్టాలి'

పార్వతీపురం మండలంలోని అడ్డాపుశిల పంచాయతీ పరిధిలో సర్వే నంబర్‌ 247లోని 70 సెంట్ల భూమికి నష్టపరిహారం చెల్లించిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దళిత కుటుంబానికి చెందిన సూర్ల నరసయ్య వారసులు కృష్ణ, రాజులకు న్యాయం చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యుడు పి. సంగం డిమాండ్‌ చేశారు.