VZM: దత్తిరాజేరు మండలంలోని చినరాజేరు గ్రామానికి చెందిన మహాదేవ్ తనూజ కొద్ది నెలల క్రితం నిర్వహించిన టెట్లో అర్హత సాధించలేకపోయానని మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పెదమానాపురం SI కళాధర్ తెలిపారు. ఇటీవలే వివాహమై రెండు రోజుల క్రితం అత్తవారింటికి వచ్చిన తనూజ అందరితో ముభావంగా ఉండేది, ఈ క్రమంలో ఎవరు లేని సమయంలో ఈ చర్యకు పూనుకుందని బంధువులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టెట్ సాధించలేదని యువతి ఆత్మహత్య


