హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో పోలీస్ మృతి

సత్యసాయి: రామగిరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న చిరుతల మళ్లీకార్జున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విధుల్లో నిబద్ధతతో సేవలందించిన ఆయన మృతి పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మళ్లీకార్జున కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆకస్మిక మరణం పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.