హైదరాబాద్: 28°C
తెలంగాణ

52 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు

నిజామాబాద్ టౌన్-1 పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీఈఐఆర్ వ్యవస్థను వినియోగించి వివిధ ప్రాంతాల్లో పోయిన 52 మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని అసలైన యజమానులకు అప్పగించారు. ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.