హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రెండు రోజుల్లో కర్నె తండా లిఫ్ట్‌ పంపులు ప్రారంభించాలి'

WNP: కర్నె తండా లిఫ్ట్‌ ఇరిగేషన్ ద్వారా 9 గిరిజన తండాలు, 6 గ్రామాలకు సాగునీరు అందించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.76.16 కోట్లతో పనులు చేపట్టిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సబ్‌స్టేషన్‌ పనుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆరోపించారు. రెండు రోజుల్లో పంపులు ప్రారంభించి రైతులకు నీరందించకపోతే రైతులతో కలిసి లిఫ్ట్‌ను ముట్టడిస్తామన్నారు.