హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నర్సింగ్‌ హోమ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం'

కోనసీమ: అమలాపురంలోని చిరంజీవి నర్సింగ్‌ హోమ్‌ నిధుల గోల్‌మాల్‌ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు అమలాపురం పట్టణ సీఐ వీరబాబు తెలిపారు. నిధుల అవకతవకలు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ఈ కేసులో మరికొందరి పాత్రపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.