హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుల దాడిలో విశ్రాంత ఉద్యోగి మృతి

VSP: యువకుల దాడిలో విశ్రాంత ఉద్యోగి మృతి చెందిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. ఎయిర్‍‌పోర్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉన్న ఐదుగురు యువకులు ఫ్లాట్ ఖాళీ చేశారు. ఖాళీ చేసే సమయంలో సమాగ్రి ధ్వంసం చేశారని యువకులను దుర్గాప్రసాద్ పిలిపించాడు. వారి మధ్య వాగ్వాదం జరగగా, ఓ యువకుడు దాడి చేయడంతో ఆయన మృతి చెందాడు.