హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్రచందనం స్మగ్లర్‌పై పీడీ యాక్ట్

TPT: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న కేరళకు చెందిన అజయ్ కుమార్ కె. అలియాస్ అజయన్ (57)పై పీడీ యాక్ట్ అమలు చేశారు. అతనిపై ఇప్పటికే ఆరు ఎర్రచందనం కేసులు ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఉత్తర్వుల మేరకు నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తప్పవన్నారు.