NTR: విజయవాడ అజిత్సింగ్నగర్లో పదేళ్లుగా ఖాళీగా ఉన్న JNNURM ఇళ్లపై సీపీఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రూ.100 కోట్ల విలువైన ఇళ్లలో అక్రమ పంపకాలు, అమ్మకాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. అక్రమాలపై విచారణ జరిపి అర్హులైన పేదలకు వెంటనే ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. డిస్నీల్యాండ్కు చెందిన 57 ఎకరాలను కూడా పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ఇళ్ల అక్రమ పంపకాలపై సీపీఎం ఫైర్


