బాపట్లలో చీలురోడ్డు పాండురంగస్వామి ఆలయం వద్ద ఎకో హౌస్లో జిల్లా స్థాయి యోగా ఛాంపియన్షిప్ పోటీలను ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా సంఘం అధ్యక్షుడు కళ్లం హరినాథరెడ్డి తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మాస్టర్స్ విభాగాల్లో బాలురు, బాలికలు, పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గెలుపొందిన వారు రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
23న జిల్లాలో యోగా పోటీలు


