హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

21న క్యాన్సర్ నిర్ధారణ శిబిరం

BPT: అమృతలూరులోని ఆర్యవైశ్య కల్యాణ మండలంలో ఈ నెల 21న క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యాధి నిర్దారణ అయిన వారికి హైదరాబాద్‌లో బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్ హాస్పిటల్‌లో ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.