MLG: గోదాముల్లో తగిన స్థలాలు కేటాయించాలని కోరుతూ ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లో ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ అనూజ్ త్యాగికి వినతిపత్రం సమర్పించారు. గోదాముల్లో స్థలాభావంతో పాటు ర్యాక్ మూవ్మెంట్ లేక బియ్యం డెలివరీలు ఆలస్యమై నష్టపోతున్నామని మిల్లర్లు వివరించారు. సమస్యపై జీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
తెలంగాణ
గోదాముల్లో స్థలాలు కేటాయించాలని ఎఫ్సీఐ జీఎంకు వినతి


