సూర్యాపేట మండలం బాలెంల స్టేజ్ సమీపంలో ఇవాళ లారీ ఢీకొని కుడకుడ గ్రామానికి చెందిన మోతె రమణయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సూర్యాపేట నుంచి జనగామ వైపు వెళ్తున్న లారీ, తిమ్మాపురం నుంచి పల్సర్ బైక్పై వస్తున్న రమణయ్యను అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు అయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఘెర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


