హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుభాష్‌నగర్‌లో కమిషనర్ శ్రీజన పర్యటన

HYD: సైబరాబాద్ కమిషనర్ గుమ్మళ్ల శ్రీజన ‘వన్ వార్డ్ ఎవరీ డే’ కార్యక్రమంలో భాగంగా సుభాష్‌నగర్ వార్డును సందర్శించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. డ్రైనేజీ, దెబ్బతిన్న రోడ్లు, పార్కుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, సీ అండ్ డీ వ్యర్థాల తరలింపు, ఫాగింగ్‌పై ఆర్‌డబ్ల్యూఏ సభ్యులతో చర్చించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.