SDPT: హుస్నాబాద్లోని కోటి వెంకటేశ్వర్లు హత్య కేసులో నిందితురాలైన ఆయన భార్య కోటి రాజమణిని పోలీసులు అరెస్ట్ చేశారు. 15 ఏళ్లుగా తమకు దూరంగా ఉంటూ, పదవీ విరమణ లబ్ధిని రెండో భార్యకు ఇవ్వాలనే కోపంతోనే ఈ హత్య చేసినట్లు ఆమె అంగీకరించిందని సీఐ కె. శ్రీధర్ పేర్కొన్నారు. నిందితురాలి నుంచి రోకలిబండను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
తెలంగాణ
భర్త హత్య కేసులో భార్య అరెస్ట్


