WG: తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, వాహనదారులకు మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ ఎస్సైలు ప్రసాద్, సోమరాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలుపురాదని సూచించారు. మద్యం సేవించి ఆటోలు నడిపితే రూ.10వేలు జరిమానా తప్పదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు అవగాహన


