SRD: సంగారెడ్డి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మంగళవారం నాగుపాము కలకలం రేపింది. పామును చూసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన గ్రామస్థులు పామును సురక్షితంగా పంట పొలాల్లోకి పంపించారు. పాఠశాల ఆవరణలో అపరిశుభ్రత తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు.
తెలంగాణ
VIDEO: పాఠశాల ఆవరణలో నాగుపాము


