హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 19న జాబ్‌మేళా: మాధవి

ఖమ్మం టీటీడీసీలో ఈ నెల 19న ఉదయం 10 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి ఎన్. మాధవి సోమవారం తెలిపారు. ఎల్‌ఐసీ, ఇండస్‌ఇండ్ నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్, కీర్తన గోల్డ్ లోన్స్ సంస్థల్లో 95 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.