హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్ ఆఫీస్‌లో ఆత్మహత్యాయత్నం

NDL: బేతంచెర్లలో రెవెన్యూ అధికారుల అన్యాయానికి నిరసనగా కుంచె మద్దిలేటి రెడ్డి అనే వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన కుమారుడి భూమిని ఆన్‌లైన్ రికార్డుల నుంచి తొలగించి, మిగులు భూమిగా చూపించారని ఆయన ఆరోపించాడు. గమనించిన సిబ్బంది వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.