హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘టీడీపీ మదనపల్లె కార్యకర్తలకు న్యాయం చేయాలి’

అన్నమయ్య: టీడీపీలో మదనపల్లె కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని మాజీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్‌.జె. వెంకటేష్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌ గృహ బిల్లులు, కొత్త పింఛన్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యేలు కోటరీలతో కార్యకర్తలను విస్మరిస్తున్నారని విమర్శించారు. అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.