హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీని బలోపేతం చేయాలి: మంత్రి

అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డిని ఏపీఎస్‌ఆర్టీసీ నూతన జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం. శివప్రసాద్‌ సోమవారం అసెంబ్లీ ఆవరణలో మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన శివప్రసాద్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.