హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో రైస్‌మిల్లులపై నమోదవుతున్న కేసులు

NZB: జిల్లా వ్యాప్తంగా మొత్తం ఆరు రైస్‌ మిల్లులపై కేసులు నమోదు అయ్యాయి. ఇందులో మొత్తంగా రూ. 200కోట్లకు పైగా ధాన్యం నిలువలు మాయం అయినట్లుగా అధికారులు అధికారికంగా గుర్తించారు. డిచ్‌పల్లి (M)లోనూ రైస్‌మిల్లు యజమానులపై క్రిమినల్‌ కేసు నమోదైంది. ఇందులో 8,614 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కనిపించడం లేదు. వీటి విలువ రూ. 27కోట్లుగా పౌరసరఫరాల సంస్థ తేల్చింది.