హైదరాబాద్: 28°C
తెలంగాణ

జలసౌధలో నేడు KRMB సమావేశం

హైదరాబాద్‌లోని జలసౌధలో నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB) సమావేశం జరగనుంది. ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రులు, ఇరిగేషన్‌కు సంబంధించిన చీఫ్ ఈఎన్సీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. కృష్ణా జలాల వినియోగం, పెండింగ్ అంశాలపై సమావేశంలో కీలకచర్చ జరిగే అవకాశం ఉంది. నీటి వాటాల కేటాయింపునకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.