నిర్మల్: ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో ఇలేగం గ్రామంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. 70 ద్విచక్ర వాహనాలు, 1కారు, 4 ఆటోలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు, గంజాయి నియంత్రణపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
ఇలేగంలో పోలీసుల కార్డాన్ సెర్చ్


