MDK: మాసాయిపేట జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని పులిగుట్ట తండాకు చెందిన మాలోతు మన్ని (40) దుర్మరణం చెందారు. రహదారిపై మృతదేహం లభించడంతో వాహనం ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి భర్త వాసురాం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి


