హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోలీసుల దాడిపై సీపీఎం ఖండన'

NLG: జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లోకి పోలీసులు బలవంతంగా ప్రవేశించి నాయకులపై దాడి చేసి అరెస్టు చేయడాన్ని సీపీఎం, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజా సంఘాల కార్యాలయంపై పోలీసుల దాడి అప్రజాస్వామికమని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.