హైదరాబాద్: 28°C
క్రీడలు

కామెంటేటర్‌గా రహానే కొత్త ఇన్నింగ్స్

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్యా రహానే కామెంటేటర్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. భారత్-శ్రీలంక టెస్టు సిరీస్‌కు సోనీ కామెంటరీ ప్యానల్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ సోనీ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. భారత్ ఆడబోయే చారిత్రాత్మక 600వ టెస్టుతో రహానే వ్యాఖ్యతగా అరంగేట్రం చేయబోతుండటం విశేషం.