AP: విజయనగరం జిల్లా మరుపల్లి సమీపంలో ఉన్న మామిడితోటలో ఒడిశాకు చెందిన మహిళ మృతదేహాన్ని పాతిపెట్టిన ఘటన కలకలం రేపింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు మోహన్ కిల్లోను ఒడిశా పోలీసులు ఘటనా స్థలానికి తీసుకొచ్చి, భూమిలో పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తవ్వించారు. మృతురాలు అనిత (22), నిందితుడు మోహన్ (45) ఇద్దరూ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
క్రైమ్
ఏపీలో ఒడిశా మహిళ మృతదేహం కలకలం


