TG: వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఘోర ప్రమాదం జరిగింది. గణేశా ఎకోపిట్ కంపెనీలో నాలుగో అంతస్తులో స్టీమ్ పైపులైన్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు టెక్నీషియన్లు లిఫ్ట్ ఎక్కగా, మంటలు లిఫ్ట్కు అంటుకోవడంతో బయటకు రాలేక అక్కడే సజీవ దహనమయ్యారు. మృతులు UPకి చెందిన సూర్యప్రకాష్(31), అభిలాష్(30)గా గుర్తించారు.
క్రైమ్
ఘోర ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం


