TG: హైదరాబాద్లోని బాలానగర్లో ఈగల్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో ఓ ఇంట్లో 14 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల సమయంలో అధికారులపై నిందితులు కుక్కని వదిలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
భారీగా గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్ట్


