హైదరాబాద్: 28°C
క్రీడలు

డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

BCCI పాలనా వ్యవస్థలో కీలక మార్పులు జరగనున్నాయి. భారత మాజీ క్రికెటర్, బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (సీవోఈ) అధిపతిగా ఉన్న VVS లక్ష్మణ్‌కు పదోన్నతి లభించనుంది. 'డైరెక్టర్ ఆఫ్ క్రికెట్' అనే కొత్త పదవిలో నియమించేందుకు బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో జరగనున్న BCCI వార్షిక సర్వసభ్య సమావేశంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.