హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రికెటర్ దాడిలో కోచ్ మృతి

శ్రీలంక దిగ్గజ కోచ్ సుమిత్ ఫెర్నాండో(62) మరణించాడు. కొలంబో స్పోర్ట్స్ సెంటర్‌లో వాటర్ ఫెసిలిటీ విషయమై ఈనెల 8న సుమిత్‌తో కొందరు క్రికెటర్లు గొడవకు దిగారు. ఆయనపై ఓ క్రికెటర్ దాడి చేశాడు. సుమిత్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. 17 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. లంక వన్డే కెప్టెన్ కుశాల్ మెండిస్‌కూ సుమితే కోచ్‌గా వ్యవహరించాడు.