హైదరాబాద్: 28°C
క్రీడలు

'రాహుల్'తో జాగ్రత్తగా ఉండాలి: శ్రీలంక కెప్టెన్

టీమిండియాతో టెస్టు సిరీస్‌లో తమకు కేఎల్ రాహుల్‌తోనే అసలు ప్రమాదమని శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా అన్నాడు. ప్రస్తుతం ఉన్న భారత బ్యాటర్లలో శ్రీలంక గడ్డపై ఆడిన అనుభవం కేవలం రాహుల్‌కే ఉందని చెప్పాడు. లంకలో ఆడిన రెండు టెస్టుల్లో అతడు రెండు హాఫ్ సెంచరీలు సాధించాడని తెలిపాడు. అందుకే రాహుల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తమ బౌలర్లకు సూచించినట్లు పేర్కొన్నాడు.