హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌కు వార్నింగ్ ఇచ్చిన లంక కెప్టెన్!

ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌కు ముందే శ్రీలంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా మైండ్ గేమ్‌ మొదలుపెట్టారు. స్వదేశంలో ఓటములతో ఒత్తిడిలో ఉన్న టీమిండియాను తమ స్పిన్ ఆయుధంతో సులువుగా దెబ్బతీస్తామని హెచ్చరించారు. గాలేలోని స్పిన్ అనుకూల పిచ్‌లపై భారత బ్యాటర్ల పనిపడతామని సవాల్ విసురుతూ.. ఈ పోరు క్రీడాభిమానులకు వినోదాన్ని పంచుతుందని చెప్పారు.