హైదరాబాద్: 28°C
క్రైమ్

పీఎస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య

TG: HYDలోని ఎల్బీనగర్ పీఎస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సాయి పీఎస్‌లోనే ఉరివేసుకున్నాడు. పోస్టుమార్టం కోసం సాయి మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియాకు తరలించారు. అయితే, అధికారుల వేధింపులే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం లేకుండా మృతదేహాన్ని తరలించారని, మృతుడి సెల్‌ఫోన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.