హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆటగాళ్ల గాయాలపై బీసీసీఐ ఆందోళన

భారత క్రికెటర్లకు తరచుగా గాయాలవుతుండటంపై బీసీసీఐ ఆందోళన చెందుతోంది. ఈ సమస్యపై బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శించిన కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, వీవీఎస్ లక్ష్మణ్‌తో సమావేశమయ్యారు. గత ఒకటిన్నర సంవత్సరాలుగా స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ విభాగాధిపతి పదవికి శాశ్వత నియామకం పెండింగ్‌లో ఉండటమే ఆలస్యానికి ప్రధాన కారణమని లక్ష్మణ్ వివరించారు.