AP: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వ్యాన్ను ఢీకొని కల్వర్టులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
క్రైమ్
వ్యాన్ను ఢీకొని బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు


