హైదరాబాద్: 28°C
క్రీడలు

బాక్సింగ్‌ ఛాంపియన్‌ సాక్షికి కోహ్లి అండ

గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో బాక్సర్‌ సాక్షి చౌదరి 51కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. తన విజయానికి విరాట్ కోహ్లి మద్దతు ఎంతో ఉందని ఆమె వెల్లడించింది. కోహ్లి చాలాకాలంగా తనకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపింది. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టి స్వర్ణం గెలిచానని, జాతీయ గీతం మధ్య త్రివర్ణ పతాకం ఎగరడం జీవితంలో గర్వకారణమని సాక్షి పేర్కొంది.