హైదరాబాద్: 28°C
క్రీడలు

అరుదైన రికార్డుకు చేరువలో పంత్‌!

టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. గాలే స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో మరో 3 సిక్సర్లు బాదితే, టెస్టుల్లో 100 సిక్సులు కొట్టిన తొలి భారతీయ ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో పంత్ ఇప్పటికే తొలిస్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాతి స్థానంలో సెహ్వాగ్‌ ఉన్నాడు.