హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ ఆటను చూడాలనుకుంటున్నా: ఆమ్లా

వన్డే ప్రపంచ కప్‌ టోర్నీ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యంలో 2027 ఎడిషన్‌ జరగనుంది. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌తోపాటు మరో ఇద్దరి ఆటను చూసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపాడు. ఇక భారత్‌ నుంచి రోహిత్ శర్మ ఆటను చూడటం నాకెంతో ఇష్టమని హషీమ్ ఆమ్లా వెల్లడించాడు.