హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారత్‌లో మరింతగా ఐఫోన్ల తయారీ!

భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల కాంట్రాక్ట్ తయారీదారులకు యంత్రాలు అందించే విదేశీ కంపెనీల పన్ను మినహాయింపును 2041 వరకు పొడిగించింది. దీనివల్ల ఫాక్స్‌కాన్, పెగాట్రాన్‌కు యంత్రాలు అందించే యాపిల్‌కు భారీగా లబ్ధి చేకూరనుంది. భారత్ ఐఫోన్ల తయారీ వాటా 26%కి చేరనుంది.