హైదరాబాద్: 28°C
క్రీడలు

పరువు కాపాడుకున్న పాకిస్తాన్‌

శ్రీలంక పర్యటనను పాకిస్తాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు విజయంతో ముగించింది. ఇరుజట్ల మధ్య జరిగిన ఆఖరి టీ20లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత వన్డే సిరీస్‌ జరిగింది. అందులో పాక్‌ ఒకటి గెలిస్తే, మిగిలిన రెండు వన్డేలు లంక గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అనంతరం టీ20 సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లలో లంక విజయం సాధించింది.