హైదరాబాద్: 28°C
క్రీడలు

ఛత్తీస్‌గఢ్ జట్టుకు IPL స్టార్ గుడ్‌బై

ఛత్తీస్‌గఢ్ క్రికెట్ అసోసియేషన్‌పై తీవ్ర అసంతృప్తితో ఐపీఎల్ స్టార్ శశాంక్ సింగ్ ఆ రాష్ట్ర జట్టును వీడాడు. ఎన్ఓసీ పొందిన ఆయన, ముంబై బ్యాటర్ ప్రసాద్ పవార్‌తో కలిసి పుదుచ్చేరి జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. గత సీజన్‌లో గాయపడితే అసోసియేషన్ నుంచి ఎలాంటి సహాయం అందలేదని, ప్రీ-సీజన్ క్యాంప్‌లకు కూడా తనను పక్కనపెట్టారని శశాంక్ ఆరోపించాడు.