హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఫుడ్‌ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్‌

ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫుడ్‌ డెలివరీ రంగంలోకి అడుగుపెడుతోంది. స్విగ్గీ, జొమాటోలకు గట్టిపోటీనిస్తూ ఈనెల 15 నుంచి బెంగళూరులో ONDC ద్వారా ఈ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫామ్‌లు 16-30% కమీషన్ వసూలు చేస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌ కేవలం 10% కమీషన్‌కే రెస్టారెంట్లను ఆకర్షిస్తోంది. దీంతో ఫుడ్ డెలివరీలో పోటీ పెరగనుంది.