హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్‌ పాండ్య

టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య తన స్నేహితురాలు మహికా శర్మతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఆదివారం వేకువజామున వీరు స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నాడు. దర్శనంతరం ఆలయ వేదపండితులు వారికి ఆశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలో ఈ ప్రముఖుల రాకతో సందడి నెలకొంది.