హైదరాబాద్: 28°C
క్రైమ్

వసతిగృహంలో విద్యార్థిని ఆత్మహత్య

AP: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొత్తూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని కేజీబీవీ వసతిగృహంలో ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. లక్కయ్యగూడ గ్రామానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.