హైదరాబాద్: 28°C
క్రీడలు

బీసీసీఐ సంచలన నిర్ణయం

భారత క్రికెట్‌లో వయో(AGE) మోసాలకు చెక్ పెట్టేందుకు బీసీసీఐ కఠిన చర్యలు చేపట్టింది. అండర్-16, 19, 23 విభాగాల ఆటగాళ్ల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ను పరిశీలించేందుకు ఓ స్వతంత్ర సంస్థను నియమించింది. పత్రాల్లో తేడాలుంటే అనర్హత వేటు వేయనున్నారు. ఇకపై బయోమెట్రిక్ తప్పనిసరి చేయనుంది.