హైదరాబాద్: 28°C
క్రీడలు

జావెలిన్‌ ఫైనల్‌లో ముగ్గురు భారత అథ్లెట్లు

కామన్వెల్త్ గేమ్స్‌ జావెలిన్‌ త్రో క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు. నీరజ్‌ చోప్రా (79.61 మీ.), రోహిత్‌ (78.37 మీ.), యశ్‌ వీర్‌ (78.36 మీ.) ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో ఈ అథ్లెట్లు అత్యుత్తమ ప్రతిభతో సత్తా చాటారు. శుక్రవారం రాత్రి ఫైనల్‌ జరగనుంది.